CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండల పరిధిలోని మారాయిగూడెం గ్రామానికి చెందిన పొన్నోజు సాయి (22) గురువారం మధ్యాహ్నం చత్తీస్గడ్ మారాయిగూడెం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. వివరాలలోకి వెళితే మారాయిగూడెం గ్రామనికి చెందిన యువకుడు మోటార్ సైకిల్ మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో సొంత పని పై పక్క రాష్ట్రమైన ఛత్తీస్ఘడ్ లోని మారాయిగూడ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు అతనికి తల్లి దేవి ఉన్నారు ఈ సంఘటనతో ఉన్న ఒక్కగానే ఒక కొడుకు దూరం కావడంతో తల్లి కన్నీరు మున్నీరు అయింది..


Share it:

TS

Post A Comment: