మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండలంలో విఆర్ఏలు పే స్కేల్ తక్షణమే అమలు చేయాలని ఏటూరు నాగారం తాసిల్దార్ ఆఫీస్ ముందు సోమవారం
వీఆర్ఏలు ఏటూరు నాగారం నిరవధిక సమ్మె నిర్వహించిన్నారు.ఈ సందర్భంగా ములుగు జిల్లా అధ్యక్షుడు గంపల శంకర్ మాట్లాడుతూ.ప్రభుత్వం వీఆర్ఏలకు ఫే స్కేల్ కి అమలు చేస్తానని చెప్పి కూడా రెండు సంవత్సరాలయింది ఇంతవరకు వి ఆర్ ఏ ల తో ఎట్టి సాకిరి చేయించుకుని జీతాలు తక్కువ ఇచ్చి మా పొట్ట మీద కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి.55 సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్ఏ స్థానంలో వారి కుటుంబంలో వారికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే అంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు గద్దల కృష్ణ,బత్తుల కృష్ణ,కంచే లక్ష్మయ్య,మాదరి దేవి,విజయ లక్ష్మి,జబ్బ నాగేష్,బొల్లె రాము,కుమ్మరి వెంకటయ్య,కాళ్ల రాము, బందెల నరసయ్య పాల్గొన్నారు.
Post A Comment: