మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామపంచాయతీలో వరద ముంపు బాధితులకు ప్రభుత్వ నుంచి వచ్చిన నిత్యవసర సరుకులు నూనె,ఉప్పు,కారం,పసుపు,చింతపండు,ఉల్లిగడ్డలు బాధితులకు అందజేసిన మల్లెలమడుగు సర్పంచ్ కోడి క్రిష్ణవేణి.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ క్రిష్ణవేణి మాట్లాడుతూ ముంపు వరద ప్రాంత బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంది అని అన్నారు.బాధితులకు తక్షణ సహాయం కింద 10,000 రూ ప్రభుత్వం అందజేస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లెలమడుగు ఉప సర్పంచ్ చావా వీరరాఘవులు,డీలర్ రజిత, అంజయ్య,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: