మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరద ముంపు గురైన పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ సందర్శించారు ముంపు గురైనటువంటి యంపిపిఎస్ పాఠశాలలు గంగోలు, చిన్నబండిరేవు,కాశీనగరం, జడ్పీహెచ్ఎస్ పర్ణశాల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పేరుకుపోయిన బురదను అలానే పరిసరాలను శుభ్రపరచాలని, వరదకు పాడైపోయిన పుస్తకాలకు బదులుగా కొత్త పుస్తకాలు అందజేస్తామని బియ్యాన్ని పిల్లలకు వండవద్దని ఆదేశాలు జారి చేశారు చిన్న బండి రేవు ఏడో తరగతి విద్యార్థుల యొక్క తెలుగు ఆంగ్లం గణితం బేసిక్స్ వారి సామర్థతను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య, పర్ణశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ మేరీ శ్రీ, ఏజే ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Post A Comment: