జూలూరుపాడు జులై 30, (మన్యం మనుగడ) ప్రతినిధి, మున్నూరు కాపు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ఎంపీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి )కి శనివారం ఉదయం జూలూరుపాడు మండలం భద్రాద్రి జిల్లా వినోబా నగర్ గ్రామంలో మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గాయత్రి రవి రాజ్యసభ సభ్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టి వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పర్యటనకు తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి వెళుతూ, తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా సరిహద్దు గ్రామమైన జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామంలో మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు .ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతోపాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే లావుడ్వా రాములు నాయక్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం లకు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘ నాయకులు బాపట్ల మురళి, మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోకటి సురేష్ ,మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రామిశెట్టి రాంబాబు, చౌడం నరసింహారావు, మల్లెల నాగేశ్వరరావు, పాలెపు భద్రయ్య, బండారి పుల్లారావు, గణప నాగేశ్వరరావు, చౌడం వెంగళరావు, ముళ్ళపాటి వెంకటేశ్వర్లు, పాలెపు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: