మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం బండారిగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన టీచర్స్ ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జూన్ నుండి ఇంగ్లీష్మీడియం తరగతులు ప్రారంభ సందర్భంగా జూన్ ఒకటి నుండి పదో తారీకు వరకు జయశంకర్ బడిబాట కు రంగం సిద్ధం చేసినట్టు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపధ్యంలో బండారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి మూడు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండాలని, ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకోవాలి తెలంగాణలోని ప్రతి తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో నూరు శాతం నమోదు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు అన్ని రకాల సదుపాయాలు ఉచితంగా మధ్యాహ్న భోజనం,వారానికి మూడుసార్లు గుడ్డు పౌష్టికాహారం అందించే ప్రభుత్వ పాఠశాల్లో మీ పిల్లలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏవీ సీతారాం, వంశీ మోహన్ ఎం. సరోజిని, రవి పాల్గొన్నారు.
Post A Comment: