మన్యం మనుగడ వెబ్ డెస్క్:
నిన్న సాయంత్రం భద్రాచలం లో సంభవించిన భారీ గాలి వానికి ఒరిగిపోయిన మరియు పడిపోయిన కొన్ని చెట్లను గ్రీన్ భద్రాద్రి టీం ఈరోజు ఉదయం పరీక్షించి వాటికి కొత్త గొయ్యిలు తీసి కర్ర సహాయంతో తాడు కట్టి నిలబెట్టడం జరిగింది. భారీ వృక్షాలు కూడా కొన్ని నేలకు ఒరిగినవి వాటిని కూడా రెండు రోజులలో చనిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, PRO కడాలి నాగరాజు, రాసమల్ల రాము పాల్గొన్నారు.
Post A Comment: