మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రం లో నిర్వహించిన ధ్యాన మహా సంకల్ప ఆరాధనా 21 రోజుల ధ్యాన దీక్ష లో భాగంగా ఈ కార్యక్రమం చీఫ్ కోఆర్డినేటర్ పబ్బోజు సత్యనారాయణ చారి విశ్వ కర్మ మాట్లాడుతూ
ధ్యానం అనేది ఒక మానసిక సత్ ప్రవర్తన, అంటే ధ్యానం ద్వారా సర్వేంద్రియాలను అదుపులో ఉంచుకొని ప్రతీకార యోచన, బుద్ధి, నుండి అమితమైన విశ్రాంతి ని పొందటం తద్వారా సాధకులకు మేధోవికాసం జరుగుతుంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత,మానసిక పరి శుభ్రతకు ఇది ముఖ్య మైన పద్దతి. ధ్యానం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి ప్రశాంతతో కూడిన మనసు, మంచి ఏకాగ్రత, అవగాహనా స్పష్టత, సమాచారం అభివృద్ధి, మానసిక నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ధ్యానం వలన మానవుల ప్రతిభా పాటవాలు, మేధోవికాసం పరిడవిల్లుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమం గురూజీ రాంబాబు చే ధ్యాన మహా సంకల్ప దీక్ష విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో సాధకులకు ధ్యానం సాధనతో పాటు ధ్యానం యొక్క ఆవశ్యకత, లాభాలు, విశిష్టత తదితర విషయాలు తెలియజేయడం జరిగింది.
Post A Comment: