CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్వేత శ్రీ జన్మదినం సందర్భంగా పినపాక ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ..

Share it:

 


  • శ్రీ జైసాయి బుక్ స్టాల్ సేవలు అభినందనీయం: ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రామ్ గోపాల్
  • బట్టి చదువులకు దూరంగా ఉండాలి:విద్యార్థిని శ్వేత శ్రీ

మన్యం మనుగడ,పినపాక: పినపాక మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు కు చెందిన శ్రీ జైసాయి బుక్ స్టాల్ నిర్వాహకులు మమత, సింగరయ్య దంపతుల ప్రథమ పుత్రిక కుమారి శ్వేత శ్రీ 15 జన్మదిన వేడుకలు పినపాక హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రూ 5 వేల విలువైన పరీక్ష సామాగ్రి(ప్యాడ్, పెన్, పెన్సిల్,ఏరేసర్, కాంపాస్)ని30 మంది పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పినపాక హైస్కూలు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రామ్ గోపాల్ మాట్లాడుతూ ... శ్రీ జయ సాయి బుక్ స్టాల్ నిర్వాహకులు మమత, సింగరయ్య దంపతులు వారు పుత్రిక శ్వేత శ్రీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేయడం అభినందనీయమన్నారు. మరి ఇంత మంది దాతలు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం బర్త్ డే గర్ల్ శ్వేత శ్రీ మాట్లాడుతూ... పదో తరగతి విద్యార్థులు బట్టి విధానంతో కాకుండా ఇష్టంగా చదవాలని ఆమె సూచించారు. రాలేక బద్ధంగా చదివి ఎస్ ఎస్ సి పరీక్షలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తనను కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త దామోదర్ గౌడ్, సోంపల్లి తిరుపతి,బోగిబోయిన జంపయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: