CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ మనోభావాలను కించపరిచిన చిన జీయర్ స్వామిపై కేసు నమోదు చేయాలి.

Share it:


మన్యం మనుగడ , పినపాక: 

ఆదివాసీల ఆరాధ్య దైవం,భారత దేశ రెండో కుంభమేళా గా ప్రసిద్ధి గాంచి, సమస్త భారత ప్రజలచే పూజలు అందుకుంటున్న మేడారం శ్రీ సమ్మక్క-సారక్క వన దేవతలను, చిన్నజీయర్ స్వామి కించపరిచే విధంగా మాటలు మాట్లాడటం సరికాదని,పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో అయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వన దేవతలు, ఆదివాసి ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ లను అవమానించిన చిన్న జీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత దేశంలోని కుంభమేళా జాతర అయన మేడారం సమ్మక్క-సారక్కల తల్లులను అవమానించడం సరికాదని, ఆదివాసీ జాతిని అవమానించారని అయన మీద వెంటనే ఎస్.టి, ఎస్.సి అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ కు చిన్న జీయర్ స్వామి పై కేసు నమోదు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ మొగిలిపల్లి నరసింహరావు, గొగ్గల నాగేశ్వరరావు, కొర్స క్రిష్ణంరాజు,సోంబోయిన సుధాకర్, పోతినేని శివశంకర్,నూప నాగభూషణం, ఎట్టి సూర్యప్రకాష్, ఎంపిటిసి కాయం శేఖర్, ఆదివాసీ ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీను,కార్యదర్శి గోగ్గల క్రిష్ణ, మీడియా సలహదారుడు సనప భరత్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: