మన్యం మనుగడ వాజేడు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల బదిలీపై తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 వల్ల పలువురు ఉద్యోగస్తులు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు పాల్పడుతున్నారని జీవో నెంబర్ 317 ను రద్దు చేయాలని వైయస్సార్సీపి భద్రాచలం నియోజకవర్గ యువ నాయకులు పూనెం సాయి తేవైయస్సార్ టిపి భద్రాచలం నియోజకవర్గ యువ నాయకులు పూనెం సాయి తేజ్జ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తన స్వగ్రామమైన వాజేడు లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలపై చెలగాట మాడుతుందనీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్న చోట ఉద్యోగస్తులను ఉండనివకుండ వారి జీవితాలతో చెలగాటంమాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. జీవో నెంబర్ 317 వలన ఉద్యోగ ఆ ఉపాధ్యాయుల కుటుంబాల జీవితాలు చిన్నభిన్నమవుతున్నాయని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కకు పెట్టడం, వారి స్థానిక ప్రాంతాలకు నెట్టి వేయడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగులకు 20 సంవత్సరాల వరకు ఉద్యోగ ఖాళీలు భర్తీ అయ్యే పరిస్థితి లేదని దుయ్యబట్టారు జీవో నెంబర్ 317ను రద్దు చెయ్యకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం ఉపాధ్యాయులను చైతన్య పరిస్థితి వైఎస్సార్ టిపి తరపున పోరాటాలకు ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Post A Comment: