CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు స్వాతి హాస్పిటల్ లో అత్యాధునిక టెక్నాలజీ తో శస్త్రచికిత్స.కుట్లు కోతలు లేకుండానే గర్భసంచిలోని కణతులు తొలగింపు.

Share it:

 





మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు స్వాతి హాస్పిటల్ లో అత్యాధునిక టెక్నాలజీ తో శస్త్రచికిత్స.కుట్లు కోతలు లేకుండానే గర్భసంచిలోని కణతులు తొలగింపు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ల బృందం.పట్టణంలోని స్వాతి హాస్పిటల్ లో,డాక్టర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి గర్భసంచిలోని కనుతులను తొలగించారు.ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు లో ఈవిధమైన శాస్త్ర చికిత్స నిర్వహించడం మొదటిసారి కావడం విశేషం.సాధారణంగా స్త్రీల గర్భసంచిలో కణితులు, గడ్డలు,చీము కారటం, కడుపునొప్పి రావడం వంటి సమస్యలకు గర్భసంచి తీసి వేయాలంటే,పెద్ద ఆపరేషన్ అంటే కడుపు పైన ఆరు నుండి ఏడు అంగుళాలు కోసి కుట్లు వేస్తారు.ఈ పద్ధతిలో ఆపరేషన్ కు పదిహేను రోజులపాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది.రోజువారీ పనులు చేసుకోవటానికి రెండు నుండి మూడు నెలల వ్యవధి పడుతుంది అని తెలిపారు. కానీ స్వాతి ఆసుపత్రిలో జర్మన్ విధానం ద్వారా సాధారణ పద్ధతిలో నిర్వహించిన ఆపరేషన్ తో రోగి ఆసుపత్రిలో ఒకరోజు ఉంటే సరిపోతుంది అన్నారు.అదేవిధంగా 15 రోజులలో రోజువారీ పనులు నిర్వహించుకోవచ్చని డాక్టర్ ప్రియాంకా తెలిపారు.స్వాతి హాస్పిటల్ లో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయినందుకు డాక్టర్ ప్రియాంక ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ శంకర్ నాయక్ అభినందనలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: