CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి.ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లే పోగు వెంకటేశ్వర్లు మాదిగ.

Share it:

 


 


మన్యం టీవి, పినపాక:

  పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి ఏడేళ్లు గడిచిన మాట నిలబెట్టుకో కపోవడం చాలా బాధాకరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అభినవ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు 27 ఏళ్లుగా వర్గీకరణ కోసం దళితుల భవిష్యత్తు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు కానీ అవకాశవాద బిజెపి అవకాశవాద కాంగ్రెస్ ఎన్నో సందర్భాల్లో వర్గీకరణ చేస్తానని ప్రకటించి ఎలక్షన్లు వచ్చినప్పుడు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి మాదిగల ఓట్లతో అధికారంలోకి వచ్చినా బిజెపి పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం చాలా దుర్మార్గమైన చర్య ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటులో మాట్లాడకపోవడం మాదిగలను మాదిగ ఉపకులాల ను బాధ కలిగిస్తుంది నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే శ్రీమతి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఒప్పించి వర్గీకరణ బిల్లు పెట్టేలా బీజేపీపై ఒత్తిడి పెంచాలని వారన్నారు లేనిపక్షంలో బీజేపీని గ్రామాల్లో తిరగని యం మాదిగల్ని మోసం చేసిన ఏ పార్టీ బతికి బట్ట కట్టిన చరిత్ర లేదని వర్గీకరణ చేయకపోతే మాకు ప్రధాన శత్రువు బిజెపి అవుతుంది వర్గీకరణ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు



 ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లే పోగు వెంకటేశ్వర్లు మాదిగ కొప్పుల అన్నయ్య మాదిగ శీను మాదిగ వంకాయల జంపయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: