CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించిన తెరాస నేత కాజా రమేష్..

Share it:

 



                                        మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకులు కాజా రమేష్ గురువారం క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేశారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు శివారు భోజ్యతండా గ్రామ పంచాయతీకి చెందిన భానోత్ విజయ్ ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో చదువుతున్నాడు, అదే విధంగా బానోత్ అభిరాం వైరా మధు విద్యాలయం లో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరిద్దరూ గత నెలలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్, కబడ్డీ పోటీల్లో పతకాలు సాధించి నేపాల్ లో ఈనెల 29 నుండి జనవరి 2 వరకు జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులు పోటీలకు వెళ్లేందుకు తమవంతు ఆర్థిక సహాయం గా తెరాస పార్టీ సీనియర్ నాయకులు కాజా రమేష్, నర్సాపురం ఎం పి టి సి కాజా విజయ రాణి దంపతులు గురువారం ఉదయం వారి స్వగ్రామమైన బొజ్యా తండా లో కలిసి ఇరువురికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాజా రమేష్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామానికి చెందిన యువకులు జాతీయ స్థాయిలో సత్తా చాటి అంతర్జాతీయ పోటీలకు ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ గిరిజన పుత్రులు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. క్రీడాకారులకు ఎల్లవేళలా ప్రోత్సహించేందుకు నిరంతరం అండగా ఉంటామని ఆయన తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడం లోనూ, నిరుపేదలను ఆదుకోవడం లోనూ ఎంతో తృప్తి ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా స్వగ్రామం లోనూ పరిసర గ్రామాలలో ఎంతోమందికి పలురకాల సహాయ సహకారాలు అందిస్తుండడం హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిశెట్టి రాంబాబు, తెల్లబోయిన రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: