మన్యం మనుగడ వాజేడు. ఈరోజు వాజేడు మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,నిరసనగా ఈరోజు వాజేడు మండల కేంద్రంలోని మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టి చావు డప్పులు మోగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో (నూగూరు)వెంకటాపురం ఏఎంసి చైర్మన్ బోధన బోయినా బుచ్చయ్య గారు , తెరాస పార్టీ మండల అధ్యక్షులు పెను మల్లు రామకృష్ణారెడ్డి, స్థానిక జడ్పిటిసి తల డి పుష్పలత , స్థానిక ఎంపీపీ శ్యామల శారద, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ , మండల,కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, రైతులు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: