మన్యం మనుగడ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామాల్లో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం లో గ్రామం ప్రక్కనే ఉన్న పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీన్ని గమనించిన రైతులు పొలాల్లో ఉన్న వడ్లను కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేసారు. గాలితో మంటలు కావడంతో మంటలార్పలేక సర్పంచ్ జజ్జరి మేనక కు ఫోన్ చెయ్యగా వెంటనే స్పందించి పంచాయతీ ట్యాంకరును పంపించగా దాన్ని సహాయంతో మంటలార్పీ రైతన్నలకు రక్షణగా నిలిచారు. ఈ మంటలు సుమారు కిలోమీటరు దూరం నుండి వ్యాపించడంతో మంటలు అర్పడం కష్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నికి ఆహుతి అయిన వరి పంట రైతులకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Navigation
Post A Comment: