మన్యం టీవీ మంగపేట.
మండలకేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం టిఎస్ యూటీఎఫ్ మండల మహాసభ ఎన్నికలు జిల్లా కోశాధికారి పొడెం సమ్మయ్య ఎన్నికల అధికారిగా హాజరై ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపు సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా స్థానికత ఆధారంగా కేటాయించాలని, లేదంటే ఉపాధ్యాయులు స్థానికత ను కోల్పోయి చాలా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. అనంతరం మహాసభ ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడుగా కాక సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ములుకాల వెంకటస్వామి, మహిళ అధ్యక్షురాలిగా బంగారు విజయ, కోశాధికారిగా బానోత్ ఈరులాల్, కార్యదర్శులుగా గుగులోత్ కిషన్, గట్టి నాగరాజు, సనప గంగా భవాని, శ్రీరాముల సతీష్ కుమార్, ఆడిట్ కమిటీ సభ్యులుగా తోట రమేష్, మాలోతు రాజు, తల్లడి జ్యోష్ణేశ్వర్ రావు, పత్రిక ఇంఛార్జిలుగా చింత కృష్ణ మూర్తి, పూనెం శ్రీనివాసరావు, సాంస్కృతిక కమిటీ సనప సురేష్, జోగ శ్రీకాళ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.
Post A Comment: