CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక నియోజకవర్గంలో పువ్వాడ పర్యటనలు- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.పాల్గొన్న ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 







  • రేగా అభివృద్ధిని చూసి అడుగడుగునా జన నీరాజనం
  • మన్నెంలో పల్లెల అభివృద్ధి ప్రదాత రేగా: ఎంపీ కవిత


మన్యం మనుగడ పినపాక / కరకగూడెం:


 రెండు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. 

 కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో రూ.2.58 కోట్ల రూపాయలతో ముక్కోటి వాగు పై అనంతరం ఆర్ అండ్ బి రోడ్డు నుండి కొత్తూరు వరకు నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. కరకగూడెం మండలం మోతే గ్రామంలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో రూ. 3.11 కోట్లతో బయ్యారం నుండి పాతరెడ్డి పాలెం మీదుగా జగ్గారం గ్రామం వరకు నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో రేగా అభిమానులు సందడి చేశారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ, రేగా కాంతారావు మన్యం ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని, ఇలాంటి నాయకుడు దొరకడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , జిల్లా కలెక్టర్ అనుదీప్ , ఏ ఎస్ పి శబరీష్ , పంచాయతీ రాజ్ సి ఈ సీతారాములు , గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , కరకగూడెం పినపాక మండలాల ఎంపీపీ లు రేగా కాళికా , గుమ్మడి గాంధీ , వివిధ శాఖల అధికారులు పినపాక, కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: