మన్యం టీవి:
కొత్తగూడెం టౌన్,కలెక్టర్ కార్యాలయం:భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్ఐ), ఆదివాసి సంఘం తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతి పత్రం అందిస్తూ అన్నపురెడ్డిపల్లి ఆదివాసి ఉపాధ్యాయురాలు కళ్యాణికి న్యాయం చేయాలని, తన మరణానికి కారకులైన ప్రిన్సిపల్,వైస్ ప్రిన్సిపాల్,పీఈటీ లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాళంగి హరికృష్ణ, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ బాధిత ఉపాధ్యాయురాలు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం,డబల్ బెడ్రూమ్ ఇల్లు, 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళా టీచర్లపై ఈ తరహా దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. కలెక్టర్ స్పందిస్తూ డబల్ బెడ్రూమ్ ఇల్లు, బాధితురాలి కుటుంబానికి గురుకుల సోషల్ వెల్ఫేర్ సొసైటీలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తామనీ, నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సండ్ర భూపేందర్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి శ్రీను, అన్నపురెడ్డి పల్లి ఎంపీపీ సున్నం లలిత, అన్నపురెడ్డిపల్లి ఆదివాసీ జేఏసీ మండల అధ్యక్షులు మడివి నాగేంద్రబాబు,ఉప సర్పంచ్ తాటి రామచంద్ర రావు
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: