మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం మేజర్ గ్రామ పంచాయితీలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా,కునవరం పంచాయితి కార్యలయం ముందు నిరసనలు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు పాల్గొన్నారు.రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయలాని, నిరసన వ్యక్తం చేస్తూ,కేంద్ర ప్రభుత్వం దిష్టి దిష్టిబొమ్మ దహనం చేశారు.అనంతరం పంచాయితీ కార్యదర్శి కి టి.ఆర్.యస్ పార్టి కూనవరం గ్రామపంచాయితీ శాఖ అధ్వర్యంలో వినతి పత్రము ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పీటీసీ పొశం. నరసింహరావు,సర్పంచ్ ఏనిక ప్రసాద్,టి.బి.జి.కె.యస్.నాయకులు కోట శ్రీనివాసరావు, అశోక్,ఎం.పి.టి.సిల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు సరిత,మార్కెట్ కమిటి డైరెక్టర్ సకిని. బాబురావు,టి.ఆర్.యస్ పార్టీ పంచాయితీ శాఖ అధ్యక్షులు పిన్నక వెంకట్రావు,ఉప్పుతల రామరావు,వహీద్,వార్డ్ మెంబర్లు,టి.ఆర్.యస్.పార్టి నాయుకులు,రైతులు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: