మన్యం టీవీ ఏటూరు నాగారం
మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పనులు చేయడం కోసం ఉపాధి హామీ కూలీలు మొగ్గు చూపుతున్నారు.అడవులలో కందకాలు తీసే పనులు అధికారులు ప్రారంభించడంతో కూలీలు పెద్ద ఎత్తున ఉదయం ఆరు గంటలకే ఉపాధి హామీ పనులకు బయలుదేరుతున్నారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి రఫీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలి పనులను పర్యవేక్షణ చేస్తూ ఉపాధి కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు.ఉపాధి హామీ ఏటూరు నాగారం టెక్నికల్ అసిస్టెంట్ సదయ్య బుధవారం ఉపాధి హామీ కూలీలు అడవులలో తీసిన కందకాల కొలతలను తీసుకుంటూ పనులను పర్యవేక్షణ చేస్తున్నారు.ఉపాధి హామీ కూలి డబ్బులు కూడా సకాలంలో అధికారులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధిహామీ కూలీలు పలువురు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: