CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది

Share it:


 మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది

👉జీవ వైవిధ్యం అందరి బాధ్యత

👉 వైవిధ్య కమిటీ సమావేశంలో  కీలక నిర్ణయాలు  తీసుకున్నాం

 ➡️జీవ వైవిధ్య కమిటీ చైర్ పర్సన్ ఎంపీపీ మంజుభార్గవి

 గుండాల ఆళ్లపల్లి నవంబర్ 6 (మన్యం మనుగడ) మండలంలోని సహజ వనరులను రక్షించేందుకు ఏర్పాటు జీవవైవిద్య కమిటీ సమావేశం  శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నమని జీవ వైవిధ్య కమిటీ   చైర్ పర్సన్ ఎంపీపీ కోండ్రు  మంజు భార్గవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది అన్నారు. మండలంలోని సహజ వనరులు దోపిడీకి  గురికాకుండా ఉండేందుకు కమిటీ పనిచేస్తుందన్నారు. సహజ  వనరుల పరిరక్షణ కోసం మండలంలో రెండు చెక్పోస్టులను ఏర్పాటుచేసి కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తారు. మర్కోడు కరకగూడెం మార్గం లోఒక చెక్ పోస్ట్  అనంతోగు గ్రామం మరో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి నిబంధనలకు లోబడి నడిచే వాహనాలకు అనుమతిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇలా చేయడంవలన అక్రమంగా తరలిస్తున్న సహజవనరులను  కాపాడటం తోపాటు ఆర్థికంగా తోడ్పాటు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ,  సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు , కమిటీ సభ్యులు మహేష్ , స్వర్ణలత , చిట్టి మల్ల బాబు ,  వసంతరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: