మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధికి పాటు పడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దళితులకు మూడు ఎకరాలు భూమిని ఇవ్వాలని తదితర డిమాండ్లతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కె వి పి ఎస్) ఆధ్వర్యంలో ఇల్లందు డిప్యూటీ తఃసిల్దారుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు మన్నెం మోహన్ రావు మాట్లాడుతూ..దళితుల పై రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు.రాష్ట్ర అంతటా దళిత బందు పథకాన్ని వర్తింప చేయాలని ,బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.అర్హులైన దళితులందరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ,బ్యాంక్ లింకేజీ తో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని,స్మశాన వాటికలకు స్థలం మంజూరు చేయాలని,మున్సిపాలిటీలో పని చేసే ళానిటేషన్ దలిత కార్మికులకు కనిసవేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చిన వారిలో కెవిపిఎస్ నాయకులు సర్వన్, రాందేవ్,దేవనంద్ లు ఉన్నారు.
Post A Comment: