వరంగల్ అర్బన్ హన్మకొండ లో చిట్ ఫండ్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. చిట్టీ పాడుకున్నా డబ్బులు ఇవ్వడానికి సంవత్సరాలు అవుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్ల కుటుంబ సభ్యులతో ధాడులు చేయిస్తున్నారు. హన్మకోండలోని అచలా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టిన రాజు అనే వ్యక్తి తన చిట్టీ పాడుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద నిన్న ఆందోళనకు దిగాడు. అది మనసులోపెట్టుకున్న అచలా చిట్ ఫండ్ యాజమాన్యం చిట్టీ ఏజెంట్ బార్యతో అతని సెల్ షాపు పైన అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించింది. ఈ ఘటనలో రాజు సెల్ ఫోన్ షాపు దగ్దమవగా రాజు పైన కూడా పెట్రోల్ పోసి అంటించడంతో రాజు తీవ్రంగా కాలితుండగా. స్తానికులు వెంటనే అతన్ని ఆర్పే ప్రయత్నం చేయగా ఎదురుగా ఉన్న పాన్ షాపు యజమాని రంగయ్య కూడా గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం రాజు చావుబతుకుల మద్య కోట్టుమిట్టాడుతున్నాడు.
Post A Comment: