మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామ పంచాయతీ, దిబ్బ గూడెం గ్రామానికి చెందిన జారే కీ వీరాభిమాని అయిన బత్తిన నాగరాజు, తానే స్వయంగా అశ్వారావుపేట నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ చిత్ర పటాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు. జారే స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామానికి నాగరాజే స్వయంగా వెళ్ళి జారే నివాసం వద్ద జారే కి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ తన చిత్రపటాన్ని గీసిన నాగరాజు కు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: