మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని చింతలమోరి గుత్తి కోయ గుంపులో ఏటూరు నాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎటువంటి ఉపాధి లేక గుత్తికోయలు ఇంటి వద్దనే ఉంటున్నారా అన్న విషయం తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మీ గూడెంలో కి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వెంటనే పోలీసువారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: