CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదల ఆకలి తీర్చే పెద్ద మనసు ఆమెకు సొంతం

Share it:

 



 మన్యంటీవీ,అశ్వారావుపేట: పట్టణంలో కరోనా వ్యాధి విశ్వరూపం దాల్చడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతుండడం తో పట్టణ ఎంపీటీసీ వేముల భారతి మంచి కార్యక్రమానికి పూనుకొని ఎందరో నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. పట్టణంలో ఓ పక్క లాక్ డౌన్ అమలులో వున్నందున వ్యాపార, అనేక రంగాలు పది గంటలకే మూతపడడంతో కొందరు నిరాశ్రయులు బస్టాండ్, సంత మార్కెట్ లలో భోజన సదుపాయం లేక అల్లాడుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని వారికీ కడుపునిండా భోజనం పెట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. ఇలా తను గెలిచిన దగ్గరనుంది ఎంతో మందికి ఎన్నోరకాలుగా సేవలు అందిస్తూ సెగ్మెంట్ ప్రజలకు సొంత కూతురిలా అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న ఎంపీటీసీ వేముల భారతిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: