తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్
మన్యం టీవీ కరకగూడెం:ఈ నెల 18 న కొమరం భీం విగ్రహవిస్కరణ బహిరంగ సభను విజయ వంతం చెయ్యలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ అన్నారు.అనంతరం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి కొమరం రాంగోపాల్ సూతరి నాగేశ్వరరావు సిద్దబోయిన శ్రీకాంత్ ఊకె గణేష్ ల సమక్షంలో కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కరకగూడెం మండల కేంద్రంలో వీరపూరం క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 18 న కొమరం భీం విగ్రహవిష్కర బహిరంగ సభను ఆదివాసీ ప్రజలంత వేలాదిగా హాజరై విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చారు.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, ప్రోపెసర్ కొదండరామ్,జస్టిస్ చంద్ర కుమార్ అడ్వకేట్ వసుధ నాగరాజు ఆదివాసీ ఎమ్మెల్యలు మాజీ ఎమ్మెల్యే లు ఆదివాసీ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వజ్జ నర్సంహరావు ఎట్టి ప్రకాశ్ కొమరం వెంకటేష్ కుంజా కృష్ణ ప్రసాద్ మునిగెల రామారావు మల్లయ్య దిలిప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: