మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలంలో గల తోగ్గూడెం గ్రామంలో గురువారం రోజున పాయం లక్ష్మి (85 ) అనే మహిళ మరణించింది. విషయం తెలుసుకున్న పంచాయితీ టిఆర్ఎస్ నాయకులు పంచాయితీ సిబ్బందిని పిలిపించి, మానవతా దృక్పథంతో ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది. కుటుంబ సభ్యులు కరోనా కారణంగా భయభ్రాంతులకు గురైన సమయంలో టిఆర్ఎస్ నాయకులు మరియు ఎంపీటీసీ చింతపండు సత్యం దగ్గర ఉండి ధైర్యాన్ని నింపి, పంచాయతీ ట్రాక్టర్ ను పిలిపించి దహన సంస్కారం కొరకు అన్ని రకాల సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చిట్టి మల్ల సతీష్ చారి, సల్లూరి లక్ష్మయ్య, కల్తీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: