👉తీరనున్న 300 మంది గిరిజన విద్యార్థుల కష్టాలు
ట్రైబల్ బీఈడీ కాలేజీని తనిఖీ చేసిన డిడి రమదేవి
👉పట్టు పరిశ్రమ కేంద్రంలో హాస్టల్ ఏర్పాటుకు చర్యలు
మన్యం టీవీ, భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు భద్రాచలం ట్రైబల్ బీఈడీ కాలేజీ తరుపున చేసిన గత కొన్ని నెలలు చేస్తున్న పోరాటం నేడు వందలాది మంది విద్యార్థులకు ఆశాదీపం గా మారింది. డిడి రమాదేవి గురువారం గిరిజన బీఈడీ కళాశాల నుతనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వసతి,కళ శాలలో విద్యా బోధన తదితర వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పట్టు పరిశ్రమ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న వసతి గృహాన్ని డిడి రమాదేవి పరిశీలించారు.విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతరావు గిరిజన బీఈడీ కళాశాల విద్యార్థుల కోసం చేస్తున్న పోరాట ఫలితమే గిరిజన బీఈడీ కళాశాల దిద్దు బాటు చర్యలు డిడి చేపట్టారని ,300మందిగిరిజన విద్యార్థులకు మేలు జరిగే ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: