మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో టిఆర్ఎస్ పార్టీ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడలలో భాగంగా క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ముందుగా తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.అనంతరం తెలంగాణ తొలి,మలి దశ అమరవీరులు కాసోజు శ్రీకాంతాచారి, కొత్తపల్లి జయశంకర్, కాళోజి,పోలీసు కృష్ణయ్య,కొమరం భీం, సోయం గంగులు, తదితరులు పేర్ల మీద షీల్డ్స్, నగదు పురస్కారాన్ని, మరియు బహుమతులు ను క్రీడలలో గెలిచిన వారికి విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు,ఎంపీపీలు,వైస్ ఎంపీపీ లు,మార్కెట్ కమిటీ చైర్మన్ లు,పీఏసీఎస్ చైర్మన్ లు,డైరెక్టర్లు,ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,పార్టీ మండల,టౌన్ అధ్యక్షులు, టిఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: