నూగురు వెంకటాపురం
బర్లగూడెం పంచాయతీ ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ములుగు,భూపాలపల్లి మరియు భద్రాద్రి కొత్తగూడెం మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...క్రీడల్లో యువత నైపుణ్యాన్ని పెంచుకోని,ఉన్నతమైన స్థానాల్లో నిలవాలని సూచించారు.క్రీడాకారులు క్రీడల్లో స్నేహపూర్వకంగా అడి,గ్రామానికి పేరుప్రఖ్యాతలు తీసుకోవాలని కోరారు.ఈ టోర్నమెంట్ బర్లగూడెం పంచాయతీ ఉద్యోగులు ఐక్యవేదిక నిర్వహించినందుకు అభినందించి,విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమరం వెంకటనారాయణరావు,ప్రజాప్రతినిధులు,గ్రామస్థులు పాల్గొన్నారు.
Post A Comment: