మన్యంటీవీ,ములకలపల్లి: సిపిఐ(ఎం)పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు తానం రవీందర్ కు,పార్టీ తరపున వీప్లవజోహార్లు తెలియజేశారు.ములకలపల్లి మండలం,చవిటిగూడెం గ్రామానికి చెందిన తానం రవీందర్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,హైదరాబాదులోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ,ఈరోజు ఉదయం మరణించారు.ఆయన గతంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గా పని చేసి,పంచాయతీ అభివృద్ధికి కృషి చేశారు.మండల కార్యకర్తగా సిపిఐ(ఎం)పార్టీలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ఆదివాసీ గిరిజనుల కోసం పాటుపడుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని,జిల్లా కమిటీ సభ్యులుగా కొనసాగారు.నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పాల్గొని,ఓటమితో వెనుతిరిగిన ఆయన,గిరిజనుల పలు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ,ఈరోజు అకాల మృతి చెందడం పట్ల,సిపిఐ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తపరుస్తూ,విప్లవ జోహార్లు తెలియజేసింది.
Navigation
Post A Comment: