మన్యంటీవీ,అశ్వారావుపేట: జనవరి 11ఆదివాసి కొండరెడ్ల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జరిగే సంబరాలలో బాగంగా ఈ రోజు అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం, రెడ్డిగూడెం, బండారుగుంపు, బండారుగుంపు కాలనీ గ్రామాలలో ఆదివాసి కొండరెడ్ల సంఘం గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ సంఘం జెండాను అవిష్కరించారు. గ్రామాలలో ప్రదర్శన చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండరెడ్ల మౌళిక సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. అన్ని రంగాలలో వెనుకబడిన కొండరెడ్లను అభివృద్ది చేయటంలో ప్రజా ప్రతినిదులు కృషిచేయాలని అన్నారు. కొండరెడ్ల సాగుచేస్తున్న పోడుభూములకు పట్టాలు మంజూరు చేయలని డిమండ్ చేసారు. సంఘం బలమైన నిర్మాణంకోసం కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు చిప్పల కొమ్మిరెడ్డి, యాట్ల మహేశ్వ రెడ్డి రెడ్డిగూడెం సర్పంచ్, గురుగుంట్ల బాబురెడ్డి, బొల్లు వెంకటేశ్వర రెడ్డి, ఉమ్మ ల దుర్గారెడ్డి, ఉప్పిశెట్టి రవీంద్ర రెడ్డి, ఉమ్మల నాగిరెడ్డి, చిప్పల వెంకన్నబాబు రెడ్డి, గోగుల మంగిరెడ్డి, బొల్లి రాజ్యలక్ష్మి, చిప్పల యశోద, యాట్ల లక్శ్మి, ఉమ్మల బాస్కర్ రెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: