-- సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు
మన్యం టీవీ చర్ల : చర్ల మండలంలోని పోడు భూములు ఉన్నగ్రామాలలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పర్యటిస్తూ ఈరోజు సింగసముద్రం గ్రామంలో జరిగిన పోడు భూముల సమస్యల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సింగసముద్రం, మల్లారం, ఉప్పరగూడెం గ్రామాల గిరిజన ప్రజలు గత 2004 సంవత్సరం నుంచి ఇక్కడ పోడు భూములను సాగు చేసుకుంటూ ఈ భూముల పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఇప్పుడు ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ఈ భూములను గిరిజనుల నుంచి లాగేసుకుంటున్నారు. దీని మూలంగా గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగులో ఉన్న అర్హత కలిగిన భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పోడు భూములపై ఉద్యమం లేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నరేష్, కొండ చరణ్, శ్యామల వెంకటేష్, మచ్చ రామారావు, కౌశిక్, మోహన్, భాస్కర్, రాజారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: