మన్యంటీవీ,దమ్మపేట: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్థాపించిన మన్యం మనుగడ మాసపత్రిక ద్వారా వెలువడిన 2021నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు మన్యం మనుగడ మాసపత్రిక వారిదిగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మొండివర్రే సర్పంచ్ బోగి బాజీ, అశ్వరావుపేట మండల మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, దమ్మపేట మండల మన్యంటీవీ ప్రతినిధి జి మోహన్, మనుబోలు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: