మన్యం టీవి, పినపాక
పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు గుదే వెంకన్నకు శ్రీమంత్ రెడ్డి ఎడ్యుకేషన్ ,వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ సాని కొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు శ్రీమంత్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమం లో బాగంగా ఈ సహాయం అందించామన్నారు.ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, రమనకుమర్,బాధితుడి తల్లి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
Post A Comment: