CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ముగిసిన 8వ మినీ చాంపియన్స్ ట్రోఫీ..

Share it:

 


మన్యం టీవీ వాజేడు.

విన్నర్ గా నిలిచిన జగన్నాధపురం జట్టు.


ఘనంగా ముగిసిన 8వ మినీ చాంపియన్స్ ట్రోఫీ.ధర్మవరం వేదికగా 10 రోజులుగా పాటు ఉత్సాహభరితంగా సాగిన మినీ చాంపియన్స్ ట్రోఫీ ఘనంగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన జగన్నాధపురం జట్టు నిర్ణీత పది ఒవరలకు  130 పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ దిగిన ఆర్గనైజింగ్ టీమ్ ధర్మవరం క్రికెట్ అసోసియేషన్ (డిసిఎ)జట్టు పది ఒవరలు ఆడి 120 పురుగులు చేసి ఓటమి పాలయ్యింది.


ఈ 8వ మినీ చాంపియన్స్ ట్రోఫీ కి మొదటి బహుమతిని చింతూరు పంచాయతీ సర్పంచ్ తెల్లం బుల్లేశ్వరరావు 10వేలు అందజేశారు.రెండవ బహుమతిని బలుసుపాటి  చిన్న సమ్మయ్య జాపకార్థం వారి కుమారులు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని గెలుపు ఓటములను సహజమని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతూరు పంచాయతీ ఉప సర్పంచ్ బొల్లె బాబు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వినోద్ కుమార్,సాయికుమార్, సందీప్ కుమార్, కిషోర్ కుమార్,భాను తదితరులు పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: