మన్యం టీవి, మణుగూరు:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలం కొత్త మల్లెపల్లికి గ్రామానికి చెందిన తోట హారిక కిడ్నీల వ్యాధితో బాధపడుతోంది. వారిది కడు బీద కుటుంబం కావడం తో ఆర్థిక సహాయంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు రూ. 5 వేల ఆర్థిక వితరణ ను పినపాక నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ శ్యాంసుందర్ రావు యువజన నాయకులు పద్దం శ్రీనివాస్,గుర్రం సృజన్,సురేందర్ మరియు మహిళా నాయకురాలు ముణ్ణి పాల్గొన్నారు..
Post A Comment: