మన్యంటీవీ ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారంలో 5వ తారీఖున జాతీయ రహదారిపై యాక్సిడెంట్ అయినటువంటి వారిని ఎంజీఎం హాస్పిటల్ లో అందరిని పరామర్శించిన ములుగు జిల్లా నాయకులు కాకుల మర్రి లక్ష్మీనరసింహారావు(లక్ష్మణ్ బాబు ) ఎంజీఎం సూపర్డెంట్ గారి తో డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారికి తెలిపారు. మృతి చెందినటువంటి స్వరూప మృతదేహన్ని ఏటూరునాగారం తరలించుట కొరకు తన సొంతం గా వెహికిల్ మాట్లాడి ఏటూరునాగారం తరలిస్తున్నారు. అంతేకాకుండా దహనసంస్కారాలు కొరకై 13 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆదుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మణ్ బాబు వెంట టిఆర్ఎస్ నాయకులు హబీబ్ ఖాన్, ప్రదీప్ రావు తదితరులు ఉన్నారు.
Post A Comment: