గుండాల మన్యం టీవీ: మావోయిస్టు పార్టీ వారం రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో పోలీస్ తనిఖీలను ముమ్మరం చేశారు. శుక్రవారం ఆళ్లపల్లి ఎస్ఐ సంతోష్ కుమార్ సిబ్బందితో కలిసి ఆళ్లపల్లి, మర్కోడు రహదారిలో నాకాబందీ నిర్వహించారు. వాహనాలను, వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చతిస్గడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్న గొత్తికోయ గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అంతేకాకుండా ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, గ్రేహౌండ్, స్పెషల్ పార్టీ బలగాలు విస్తృతంగా గాలింపు చేస్తున్నట్లు సమాచారం.
Navigation
Post A Comment: