మాన్యంటివీ, అశ్వాపురం:మండల కేంద్రము లోని అరీఫా రోష్ని వృద్ధాశ్రమంలో ఏ పీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జగన్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వృద్దులకు పాలు, పండ్లు, బ్రెడ్, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు వైవీ. పురుషోత్తం, రెడ్డి మహేష్ కుమార్, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వర రావు, మాల మహానాడు జిల్లా కార్యదర్శి సంసొను, మైనార్టీ నాయకుడు ఎస్ కే.నయీం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: