మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను బుర్గంపాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,నరేందర్, వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, మరియు డైరెక్టర్లు మర్యాద పూర్వకంగా కలిసి విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను ఘనంగా సన్మానించారు.తమకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, నరేందర్ ను మరియు వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, డైరెక్టర్లు,సకిని బాబురావు,కుంజ శ్రీనివాసరావు,తునికి సుజాత, బానోత్ శ్రీనివాస్,బిల్లం సాంబశివరావు, గుంపెన శ్రీనివాస్ లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బుర్గంపాడ్ మార్కెట్ కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: