మన్యం టీవి, తాడ్వాయి:
ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ విద్యార్థికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బోడ నర్సింగరావు, ప్రశాంతి దంపతుల కుమారుడు అజయ్ బ్లడ్ క్యాన్సర్ తో (లుకేమియా) వ్యాధితో బాధపడుతున్నాడు. 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్ కు చెందిన వైద్యులు వెల్లడించారు. అజయ్ పేద కుటుంబానికి చెందిన విద్యార్థి. డబ్బులు లేక బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న కాటాపూర్ గ్రామ
పూర్వ ఉపాధ్యాయుడు కర్నకంటి రాంమూర్తి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న అజయ్ అనే దళిత విద్యార్థి కి ఆర్థిక సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలానికి చెందిన వెంగల కృష్ణ ప్రసాద్ పంపించిన 5వేల నగదు రూపాయలను కాటాపూర్, పూర్వ ఉపాధ్యాయుడు కర్ణకంటి రామూర్తి కి పంపించగా, రాంమూర్తి సార్ చేతులమీదుగా తన సొంత ఇంటికి చేరుకొని వారి సోదరి, కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కాటాపూర్ గ్రామస్తులు చేస్తున్న విరాళాల సేకరణ కార్యక్రమం స్పూర్తి తో ఈ
విరాళం పంపినట్లు వెంగల కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నకంటి రాంమూర్తి మాట్లాడుతూ..అజయ్ అనే దళిత విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగు పరిచేందుకు దాతలు తోచిన సహాయం అందించి అండగా నిలవాలని కోరారు.
Post A Comment: