CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

Share it:

 


మన్యం టీవి, గుండాల:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. గుండాల మండలం.. హరితహారం పేరుతో పోడు భూములను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీశాఖ అధికారులు, పోలీసుల చేత ఆదివాసి, గిరిజనుల నుండి బలవంతంగా లాక్కోవడం నిలిపివేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మండల కేంద్రంలో రెండు వేల మంది ఆదివాసీ గిరిజన రైతులతో స్థానిక ప్రజా ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంత ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కోడూరి మధు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ అడవులను నాశనం చేసేది గిరిజన రైతులు కాదని బడా కాంట్రాక్టర్లు, సింగరేణి సంస్థ, కార్పొరేట్ కంపెనీల నీ, 15 రోజులుగా రైతులు ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని 2005 అటవీ హక్కుల చట్టం లో పోడు సాగు చేసుకుంటున్న ప్రతి గిరిజనుడికి పట్టాలివ్వాలని అందులో ఉందని, భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: