మన్యం టీవీ మణుగూరు:
ఉద్యోగ, ఉపాద్యాయ, ప్రజాసంఘాలు మరియు సీపీఎం బలపర్చిన సీపీఐ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి కామ్రేడ్ జయసారధి రెడ్డి మణుగూరు సీపీఐ కార్యాలయం లో గురువారం సీపీఐ,సిపిఎం ఉమ్మడి మీటింగ్ లో పాల్గొని గెలుపు కోసం కృషి చేయాలి అని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సిగా అవకాశం ఇవ్వండి.ప్రజలు,కార్మికులు, నిరుద్యోగుల గొంతుకను శాసనమండలిలో వినిపిస్తానని జయ సారధిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ,సీపీఎం జిల్లా కార్యదర్శులు కామ్రేడ్ షాభిర్ పాషా మరియు అన్నవరపు కనకయ్య , బొల్లోజు అయోధ్య ,మచ్చ వెంకటేశ్వర్లు, సరెడ్డి పుల్లారెడ్డి,కాటిబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: