CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ అధికారులతో ఎమ్మెల్యే యుద్ధం ఏజెన్సీ లో సంచలనంగా మారిన రేగా పిలుపు

Share it:


... 

పోడు భూములపై అంశంలో అటవీ అధికారులపై ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారుల తీరుపై యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఫేస్బుక్ పేజ్లో పోస్టులు చేశారు.

పోడు భూముల విషయంలో అటవీ అధికారుల తీరు మారడం లేదని, వారిపై యుద్ధం చేయాల్సిందేనని రేగా కాంతారావు స్పష్టం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని అటవీ అధికారులపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

గ్రామాలకు అటవీ అధికారులను రానీయొద్దని, ఒకవేళ వస్తే నిర్బంధించాలని సూచించారు. ఇప్పుడే వారితో అమీతుమీ తేల్చుకోకపోతే రోడ్లపై అడుక్కొని తినాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు ఏజెన్సీలో సంచలనం గా మారగా.. మరోవైపు ప్రభుత్వం లోనూ చర్చనీయాంశంగా మారింది. 

Share it:

SLIDER

TELANGANA

Post A Comment: