మన్యంటివి,అశ్వారావుపేట: పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో ఉచిత సేవ కార్యక్రమాలు చేస్తూ మరియు పేద కుటంబాలకు అండగా ఉంటూ పిఎస్ఆర్ ట్రస్ట్ ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పిఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఘనంగా పొంగులేటిని శాలువాతో సన్మానించిన జక్కుల రాంబాబు. పిఎస్ఆర్ ట్రస్ట్ ఈ రోజుతో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పొంగులేటి సమక్షంలో కేక్ కట్ చేసి పొంగులేటి పై మరొక సారి తన అభిమానాన్ని చాటుకున్న జక్కుల రాంబాబు.ఈ సందర్భంగా పొంగులేటి నా పేరుమీద ట్రస్ట్ నడపడం చాలా సంతోషంగా ఉందని తన అభిమాని జక్కుల రాంబాబును అభినందించారు.
Post A Comment: