మన్యం మనుగడ మాసపత్రిక తెలంగాణ ప్రాంతానికి ముందుండి నడిపించాలని మన్యం మనుగడ మాసపత్రిక ఛైర్మన్,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.మన్యం మనుగడ మాసపత్రిక విలేఖరుల విస్తృత సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై,మాట్లాడారు.ఈ పత్రిక జాతుల ఐక్యత,జాతరుల ప్రాముఖ్యత,సమాజంలోని మార్పు కోసం,తెలంగాణ మారుమూల ప్రాంతపు సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని తెలిపారు.మన్యం మనుగడ విలేఖరులకు ఐడి కార్డ్స్,ప్యాడ్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కంది రామచంద్రారెడ్డి,దామోదర్,వెంకట్,మన్యం మనుగడ విలేఖరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: