మన్యం టీవీ, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య , పినపాక నియోజకవర్గ కార్యదర్శి పుల్లారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న 60 గిరిజన కుటుంబాలు గురించి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని వారు పోరాడుతున్న పోడు భూముల కోసం తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి అడవి లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు కనీసం రహదారి కరెంటు సౌకర్యాలు లేకపోవడం ఎంతో బాధాకరం అన్నారు.
Post A Comment: